News August 10, 2024

బంగ్లా మైనారిటీల 4 డిమాండ్లు ఇవే

image

బంగ్లాలో మైనారిటీ వ‌ర్గాలు త‌మ హ‌క్కుల సాధ‌న‌కై ఉద్య‌మించాయి. మైనారిటీ వ‌ర్గాల కోసం దేశంలో ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ‌, మైనారిటీ ర‌క్ష‌ణ క‌మిష‌న్ ఏర్పాటు చేయాలని, దాడుల‌ను అరిక‌ట్టేందుకు క‌ఠిన చ‌ట్టాల‌ను తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పార్ల‌మెంటు స్థానాల్లో మైనారిటీల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ఢాకాలోని షాబాగ్ వేదికగా ఉద్య‌మించాయి.

Similar News

News January 25, 2026

అభిషేక్ శర్మ ఊచకోత..

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. భారత్ తరఫున టీ20లలో ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తొలి స్థానంలో అభిషేక్ గురువు యువరాజ్(12 బంతుల్లోనే అర్ధ సెంచరీ) ఉన్నారు.

News January 25, 2026

చెప్పింది 3 వేలు.. అసలు లెక్క 30 వేలు!

image

ఇరాన్ నిరసనల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి 8, 9వ తేదీల్లోనే దాదాపు 30 వేల మంది మృతి చెందినట్లు USకు చెందిన TIME మ్యాగజైన్ వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన 3,117 మరణాల కంటే హాస్పిటల్‌ రికార్డులు, స్థానిక అధికారులు, వైద్యులు తెలిపిన సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. సుమారు 4,000 ప్రాంతాల్లో నిరసనలు జరగగా ఇంటర్నెట్ ఆపేయడం వలన వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియలేదని పేర్కొంది.

News January 25, 2026

ప్రియుడి ఇంటికి నిప్పు.. చివరికి

image

AP: ప్రియుడిపై కోపంతో అతడి ఇంటికి ప్రియురాలు నిప్పు పెట్టిన ఘటన గుంటూరులోని సుద్దపల్లిలో చోటు చేసుకుంది. వివాహితుడైన మల్లేశ్‌(31)తో దుర్గ(28) అక్రమసంబంధం పెట్టుకోగా ఇరువురి మధ్య గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో ప్రియుడు కుటుంబం ఇంట్లో ఉండగా దుర్గ పెట్రోల్ పోసి నిప్పంటించింది. పెట్రోల్ మీద పడి దుర్గకు కూడా తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.