News August 10, 2024

వీరిని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డు

image

నలుగురు ముష్కరుల ఊహా చిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ చెబితే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేస్తామని తెలిపారు. కథువా జిల్లాలో మచేడీ‌లో పెట్రోలింగ్ చేస్తున్న ఐదుగురు సైనికులపై జులై 8న బురద ప్రాంతాల్లో దాక్కొని ఈ టెర్రరిస్టులు దాడి చేశారు. ఘటనలో ఒక జవాన్ మరణించారు. జులై 15న కూడా ఇలాంటి దాడే జరిగింది. జైష్ ఏ మహ్మద్ షాడో గ్రూపులే ఇలా చేస్తున్నాయని సమాచారం.

Similar News

News February 7, 2025

TODAY HEADLINES

image

☞ TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేయాలి.. ఎమ్మెల్యేలతో CM
☞ TG పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
☞ తీన్మార్ మల్లన్నకు TPCC షోకాజ్ నోటీసులు
☞ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34%: AP క్యాబినెట్
☞ కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: CM చంద్రబాబు
☞ అప్పులు చేయడంలో కూటమి ప్రభుత్వం రికార్డ్: జగన్
☞ సమాజంలో కాంగ్రెస్ కుల విషం చిమ్ముతోంది: PM
☞ ENGతో తొలి వన్డేలో IND విజయం

News February 7, 2025

కులగణన మళ్లీ చేయాలి: మాజీ మంత్రి

image

TG: కులగణన మళ్లీ చేయాలని, రెండోసారి సర్వే చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సర్వే లెక్కల్లో స్పష్టత లేదని, ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. 2014 కేసీఆర్ సర్కార్ నిర్వహించిన సర్వే కంటే ఇప్పటి సర్వేలో జనాభా 62 లక్షలు తగ్గిందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News February 7, 2025

ఈ ఊళ్లో అసలు చెప్పులు వేసుకోరు..!

image

AP: తిరుపతికి 50 కి.మీ దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయతీ వేమన ఇండ్లు గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. ఆ గ్రామానికి కలెక్టర్, సీఎం వచ్చినా ఊరవతల చెప్పులు వదిలి రావాల్సిందే. ఇది వారి తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. వేంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తితోనే వారు చెప్పులు ధరించరు. బయట ఫుడ్ అసలు తినరు. స్కూళ్లో మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి వ్యక్తులను తాకరు. అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రులకు వెళ్లరు.

error: Content is protected !!