News August 10, 2024
బెల్లం రమ్ వచ్చేస్తోంది గురూ..

బెల్లంతో తయారు చేసిన మొట్టమొదటి దేశీయ ఒరిజినల్ రమ్ త్వరలో కర్ణాటక మార్కెట్లోకి విడుదలకానుంది. హులి (టైగర్) పేరుతో ఆగస్టు 15న రానున్న ఈ మైసూర్ స్పెషల్ బ్రాండ్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇంట్లోని ముఖ్యమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన బెల్లం రమ్ను ప్రీమియం రమ్గా అభివృద్ధి చేశారు. 750ml బాటిల్ బేస్ ధర రూ.630 కాగా, పన్నులు కలుపుకొని రూ.2,800కి లభించనుంది.
Similar News
News March 6, 2026
ఇరాన్పై దాడి.. మోదీకి ముందే చెప్పారా?

ఇరాన్పై దాడులకు కొన్ని రోజుల ముందే పీఎం మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహు దాడి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. అయితే దాంట్లో నిజం లేదని భారత్లోని ఆ దేశ అంబాసిడర్ అజార్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే దాడి టైమింగ్ నిర్ణయించామని తెలిపారు. అందుకే మోదీకి ఈ విషయం ముందే తెలిసే ఆస్కారమే లేదని వివరించారు.
News March 6, 2026
థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు భారీ ఊరట

TG: థియేటర్ల పార్కింగ్ విషయంలో ప్రేక్షకులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ కోసం ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121 GOను కోర్టు సస్పెండ్ చేసింది. ఇక మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ చూపిస్తే పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందనే విషయం తెలిసిందే.
Share It
News March 6, 2026
ఎర్లీ డిన్నర్.. రాత్రి ఆకలేస్తోందా?

హెల్త్ కోసం ఎర్లీగా తింటే పడుకునే టైమ్కు ఆకలేసి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి కొన్ని టిప్స్ పాటిస్తే బెటర్. ముందుగా సైకలాజికల్గా ఈ టైమ్ తర్వాత తినొద్దని ఫిక్స్ అవ్వాలి. ఆకలేయగానే తినడానికి బదులు నీళ్లు తాగాలి. పాలూ తాగొచ్చు. నట్స్ లాంటి పోషకాలతో కూడిన స్నాక్స్ తక్కువ మోతాదులో తినొచ్చు. జర్నలింగ్, వాకింగ్ వంటి హాబిట్స్తో ఆకలిని మరిపించొచ్చు. కొన్నాళ్ల తర్వాత బాడీ అలవాటుపడిపోతుంది.


