News August 10, 2024

HYD: Way2 News కథనంపై స్పందించిన రిజిస్ట్రార్

image

PHD ఫలితాల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ అనే శీర్షికపై Way2 Newsలో వచ్చిన కథనానికి JNTU యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందించారు. సోమవారం PHD ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Similar News

News September 25, 2024

BREAKING: HYD: మూసీలో అధికారుల సర్వే

image

HYD అత్తాపూర్‌ వద్ద ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు కలిసి <<14194082>>మూసీలో నిర్మాణాలను<<>> పరిశీలిస్తున్నాయి. నది గర్భంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను సేకరిస్తూ యాప్ ద్వారా నిర్ధారిస్తున్నాయి. మరోవైపు గండిపేట, రాజేంద్రనగర్ వద్ద మూసీలో అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా మూసీ నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు పునరావాసం కల్పిస్తామని అధికారి దాన కిశోర్ స్పష్టం చేశారు.

News September 25, 2024

BREAKING: ఆపరేషన్ మూసీ.. అక్రమ నిర్మాణాల గుర్తింపు

image

మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నది వద్ద ఇళ్లు కట్టుకున్న వారిని తరలించేందుకు రెడీ అయ్యారు. మూసీ గర్భంలో 2,166 నిర్మాణాలను అధికారులు గుర్తించగా ఇందులో HYDలో 1,595, రంగారెడ్డిలో332, మేడ్చల్‌లో 239 ఉన్నాయి. మూసీలో ప్రైవేట్ వ్యక్తులవి 16వేల నిర్మాణాలున్నాయి. కాగా పునరావాసం కింద నిర్వాసితులకు 15వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని అధికారి దానకిశోర్ తెలిపారు.

News September 25, 2024

28న ఎంజే మార్కెట్‌లో గజల్, షాయరీ

image

సిటీ వారసత్వాన్ని కాపాడడంతోపాటు, కళలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం ఎంజే మార్కెట్ ప్రాంగణంలో గజల్, షాయరీ నిర్వహించనున్నారు. దీన్ని వినిపించడానికి ప్రముఖ కళాకారులు రాన్నారు. బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.