News August 10, 2024

కాసిపేట: కూతురి మృతిపై అనుమానం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు

image

తన కూతురు రోషిని మృతిపై అనుమానం ఉందని తండ్రి తిరుపతి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. కాసిపేట మండలం స్టేషన్ పెద్దనపల్లికి చెందిన వెంకటేష్‌తో రోషినికి 3ఏళ్ల క్రితం వివాహం చేశారు. రోషినికి జ్వరం రాగా భర్త వెంకటేశ్ బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News November 12, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదని అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.

News November 12, 2025

ఆదిలాబాద్ పోస్టుల వివరాలు ఇవే.!

image

ADB జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయలు, బాలికల హాస్టల్ అనుబంధ మోడల్ స్కూల్‌లల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే KGBV ఆదిలాబాద్ రూరల్, అర్బన్, బేలా, మావల, తోషం మొత్తం ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే బాలికల హాస్టల్ బంగారిగూడలో నాలుగు పోస్టులు హెడ్ కుక్(1), అసిస్టెంట్ కుక్(2) వాచ్ ఉమెన్(1) నాలుగు పోస్టులు ఉన్నాయన్నారు.

News November 12, 2025

ఆదిలాబాద్‌లో JOBS.. అప్లై NOW

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (KGBV), అనుబంధ మోడల్ స్కూళ్లలో బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే ఈ నియామకాలకు స్థానిక మండలానికి చెందిన 18-45 ఏళ్ల వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా అర్హులు మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.