News August 11, 2024
NZB: ‘సీజనల్ వ్యాధులకు మందులు అందుబాటులో ఉంచుకోవాలి’

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ అన్నారు. శనివారం నిజామాబాద్ రూరల్ పరిధిలోని తిర్మన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News March 1, 2026
నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
News March 1, 2026
NZB: డీసీఎం ఢీకొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైక్పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పరుశురాం సదా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు SHO తెలిపారు.
News March 1, 2026
NZB: పీఎంశ్రీ పాఠశాలలను పరిశీలించిన సెంట్రల్ నోడల్ అబ్జర్వర్

జిల్లాలో పీఎం శ్రీనిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులను, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు చేసిన 40 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు.


