News August 11, 2024

భీమరంలో సచివాలయ ఉద్యోగి సస్పెండ్

image

విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఓ సచివాలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించినందుకు ప.గో జిల్లా భీమవరంలోని 11వ వార్డు సచివాలయ ఉద్యోగి (ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ) ఎం.రాఘవను సస్పెండ్ చేశారు. ఈ మేరకు పురపాలిక కమిషనర్ శ్యామల ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌‌పై కేసు

image

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.

News February 16, 2026

ప్రశాంతంగా శివరాత్రి ఉత్సవాలు: కలెక్టర్

image

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ శివరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 క్షేత్రాలలో సోమేశ్వర స్వామి దేవాలయం, క్షీర రామలింగేశ్వర స్వామి 2 పంచారామ క్షేత్రాలు మన జిల్లాలోనే ఉండడం ఎంతో విశేషం అన్నారు. శైవక్షేత్రాలను సుమారు 3 లక్షల 50 వేల మంది పైగా భక్తులు దర్శించుకోవడం జరిగిందన్నారు.

News February 16, 2026

నేడు యథావిధిగా PGRS

image

భీమవరం కలెక్టరేట్‌, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు.