News August 11, 2024
కోనసీమ జిల్లాలో RWS ఏఈ మిస్సింగ్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (AE) కె.సురేశ్ అదృశ్యంపై అతడి తండ్రి దన రామప్రసాద్ ఆదివారం అమలాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం 10:45 గంటలకు ఇంటి నుంచి విధులకు వెళ్లాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ అందుబాటులోనే ఉందని, తర్వాత నుంచి పనిచేయటం లేదన్నారు. సురేశ్ అమలాపురంలో ఉంటున్నారు.
Similar News
News October 7, 2024
రంపచోడవరం: CRPF జవాన్ మృతి
చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2024
ధవళేశ్వరం బ్యారేజీ UPDATE
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.
News October 7, 2024
సామర్లకోటలో 8న మినీ జాబ్ మేళా
సామర్లకోట టీటీడీసీలో 8న (మంగళవారం) ఉదయం 10.గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, సీడన్ జేడీఎం కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. వివిధ ఉద్యోగుల్లో పని చేసేందుకు పది, ఇంటర్, ఐటీఐ, ఫిట్టర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.