News August 11, 2024

ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగాన్ని పరిశీలించిన SP

image

ఒంగోలులో జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఎస్పీ తనిఖీ చేసి కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది వివరాలు పరిశీలించారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్, ఏఆర్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, ఆయుధాగారంలో ఉన్న ఆయుధ సంపత్తి, మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగం, వ్యాయామశాల, సిబ్బంది బ్యారాక్, గార్డ్ రూములు తదితర విభాగాలను పరిశీలించి, విభాగాలరికార్డుల నిర్వహణపై ఆరా తీశారు.

Similar News

News September 30, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య?

image

పామూరులోని 565 జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సోమవారం మృతి చెందారు. రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహం కాళ్లు, చేతులు, మెడను తాళ్లతో కట్టి ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పట్టణంలోని కరెంటు కాలనీకి చెందిన సిద్ధవటం వెంకటేశ్వర్లు (45)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యా మరేదైనా కారణమా అన్న కోణంలో విచారిస్తున్నారు.

News September 30, 2024

గిద్దలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

గిద్దలూరు మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని సర్విరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు దాటుతున్న 6 సంవత్సరాల బాలుడిని, వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు.

News September 30, 2024

పింఛన్లపై ప్రకాశం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా అక్టోబర్ 2024కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ 100 శాతం పంపిణీ చేయాలన్నారు.