News August 11, 2024

నిజామాబాద్: రైల్లో భారీగా నల్లబెల్లం పట్టివేత

image

రైలులో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక సంచులను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఆపరేషన్ సతర్క్‌లో భాగంగా నిజామాబాద్ RPF, GRP ప్రత్యేక బృందాలు 17057 నంబర్ ట్రైన్‌లో తనిఖీ చేయగా 3 నల్లబెల్లం సంచులు, 7 పటిక సంచులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని నిజామాబాద్ RPF పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాటి విలువ రూ.19,600 ఉంటుందని CI సుబ్బారెడ్డి తెలిపారు.

Similar News

News February 6, 2025

నిజామాబాద్‌లో చికెన్ ధరలు

image

నిజామాబాద్‌లో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ KG రూ.220 నుంచి రూ.240, విత్ స్కిన్ రూ.200 నుంచి రూ.210 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. అయితే, బాన్సువాడలో వైరస్ ప్రభావంతో కామారెడ్డిలో KG రూ. 180కి పడిపోవడం గమనార్హం. ఇంతకీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి.?

News February 6, 2025

NZB: రుణాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి: సెర్ఫ్ డైరెక్టర్

image

స్వయం సహాయక సంఘ సభ్యులు బ్యాంకు రుణాలు పొంది జీవనోపాధి పొందుతున్న ఆదాయ వివరాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలని సెర్ఫ్ డైరెక్టర్ ప్రశాంతి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన డీపీఎం, ఎపీఎం, సీసీ, కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామస్థాయిలో పనిచేసే అసిస్టెంట్లకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి సాయ గౌడ్, జిల్లాల అధికారులున్నారు.

News February 5, 2025

NZB: పరీక్షా కేంద్రాలను తనిఖీ

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రవి కుమార్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో 15 కేంద్రాలను తనిఖీ చేశారు.

error: Content is protected !!