News August 11, 2024
ఏపీలో మరిన్ని ఎయిర్పోర్టులు: రామ్మోహన్

AP: దగదర్తి(నెల్లూరు), కుప్పం, నాగార్జునసాగర్ వద్ద ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ‘ఈ ప్రాజెక్టుకు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే శక్తి ఉంది. గత నెల నుంచి ఇప్పటివరకు పనుల్లో 4% పురోగతి ఉంది. మొత్తం ఇప్పటివరకు 36% పనులు పూర్తయ్యాయి. గడువు కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తాం’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News December 29, 2025
అనర్హత వేటు తప్పింది: కేసీఆర్ మళ్లీ వస్తారా..?

TG: అసెంబ్లీకి KCR అలా వచ్చి, రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. దీంతో రూల్ ప్రకారం 6 నెలలు సభకు హాజరు కాకుంటే MLA పదవిపై పడే అనర్హత వేటు తప్పింది. ఈసారి సెషన్స్లో జల వివాదాలపై చర్చిద్దామని, KCR రావాలని CM రేవంత్ సహా మంత్రులు సవాల్ విసిరారు. అంతకుముందు KCR వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై చర్చ కోసం KCR మళ్లీ సభకు వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
News December 29, 2025
రూ.600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్. డీల్ ఫిక్స్ అయితే భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికం కానుంది.
News December 29, 2025
సాగుకు ఆధునిక యంత్రాల సాయం.. రైతుకు తగ్గిన శ్రమ

గతంలో వరి, ఇతర పంటల సాగులో నారు, విత్తనం దశ నుంచి కోత వరకు మానవ శ్రమ, ఎడ్ల శ్రమ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల కారణంగా పంట నాటే దశ నుంచి కోత వరకు అనేక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా నాగలి, దంతె, గొర్రు వంటి పనిముట్ల వినియోగం బాగా తగ్గింది. పంట నాటే దశ నుంచి కోత వరకు ఆధునిక యంత్రాలు కీలకపాత్ర పోషిస్తూ అన్నదాత శ్రమను తగ్గించి సమయాన్ని ఆదా చేస్తున్నాయి.


