News August 12, 2024

హిండెన్‌బర్గ్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన సెబీ

image

సంస్థ ఛైర్‌పర్సన్‌ మాధబీ బుచ్‌పై ఆరోపణలపై సెబీ తొలిసారి స్పందించింది. ‘అలాంటి నివేదికలపై స్పందించేముందు ప్రశాంతంగా ఉండి తగిన శ్రద్ధ వహించండి’ అని ఇన్వెస్టర్లకు సూచించింది. కాగా హిండెన్‌బర్గ్ నివేదిక రేపు భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని మదుపర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News September 14, 2025

SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం: కేటీఆర్

image

TG: SLBC టన్నెల్ కూలి 200 రోజులైనా కేంద్రం స్పందించడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఎక్స్‌లో ఆరోపించారు. ‘కాళేశ్వరంలో చిన్నపాటి లోపాలకే హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం SLBC ఘటనపై ఒక్క బృందాన్ని కూడా పంపలేదు. చోటా భాయ్‌ను బడే భాయ్ కాపాడుతున్నారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

image

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

News September 14, 2025

శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

image

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు