News August 12, 2024

కాకినాడ: తల్లిదండ్రుల చెంతకు యువకుడు

image

అన్నవరం రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించిన 17 ఏళ్ల యువకుడు గాజుల స్వామిని GRP పోలీసులు ఆదివారం తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. యువకుడి ప్రవర్తన తేడాగా ఉండటంతో హెడ్‌కానిస్టేబుల్ శ్యామ్ తుని GRP ఎస్ఐ అబ్దుల్ మారూఫ్‌కి సమాచారం అందించారు. రెస్టారెంట్‌లో పనిచేయమని తల్లిదండ్రులు కోరగా అది ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు విచారణలో గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి అప్పగించారు.

Similar News

News January 17, 2026

ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

రాజమండ్రి ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎన్జీవో సంఘ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భవనాన్ని ఆధునీకరించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.

News January 17, 2026

రాజమండ్రి: పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శిబిరాలు

image

తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 19 నుంచి 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. పశువుల ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

News January 17, 2026

అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

image

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.