News August 12, 2024
మాచవరంలో అతిసారం బారిన పడిన 12 మంది

మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం ఎస్సీ కాలనీలోనూ అతిసారం ప్రబలింది. మూడు రోజుల్లో 12 మంది అతిసారం బారిన పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వారిలో కొందరు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతుండగా.. కొందరిని సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు కాలనీలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నేడు గుంటూరు నుంచి వైద్య బృందం రానున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 28, 2025
రేపు కలెక్టరేట్లో రెవెన్యూ క్లీనిక్ ఏర్పాటు: కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సోమవారం నుంచి రెవిన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఆదివారం తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల MROలు, గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ గ్రామస్థాయి రికార్డులతో హాజరవుతారన్నారు. మండలాల వారీగా కౌంటర్లు ఉంటాయన్నారు.
News December 28, 2025
గుంటూరు జిల్లాలో ఇద్దరు యువకులు స్పాట్డెడ్

గుంటూరు నగర శివారు 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. యువకులు బైక్పై గుంటూరు నుంచి ఒంగోలు వైపునకు బయలుదేరారు. చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. మృతులు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరానికి చెందిన చాట్ల నాని, అశోక్గా పోలీసులు గుర్తించారు. నల్లపాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
News December 28, 2025
ఆ అధికారుల చొరవతో గుంటూరు జిల్లా శుభిక్షం

2025లో గుంటూరు జిల్లా వరుస తుఫాన్లు, ప్రమాదాలు, ప్రకృతి వపత్తులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
సమర్థవంతమైన పాలనతో వాటి నుంచి జిల్లాను సురక్షితంగా నడిపించిన నలుగురు అధికారుల పాత్ర కీలకంగా నిలిచింది. అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి, SP సతీష్ కుమార్తో పాటు ప్రస్తుత కలెక్టర్ తమీమ్ అన్సారియా, SP వకుల్ జిందల్ సమన్వయంతో తీసుకున్న చర్యలతో జిల్లా శుభిక్షంగా ఉందని ప్రజలు అంటున్నారు.


