News August 12, 2024

జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

image

జమ్మలమడుగు-ముద్దనూరు రహదారిలో చిరుత కనిపించినట్లు స్థానిక యువకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆ కొండ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరులకు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు పట్టణంలోని వ్యర్థాలను ముద్దనూరు-జమ్మలమడుగు ప్రధాన రహదారిలో వేస్తున్నారు. ఈ వ్యర్థాల వద్దకు పందులు, కుక్కలు ఎక్కువ సంచరిస్తూ ఉండేవి. ఇందులో భాగంగా ఆ కుక్కలు, పందుల కోసం చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 28, 2026

’60 ఏళ్ల స్నేహం’ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కంటతడి

image

రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ “మంచి మిత్రుడిని కోల్పోయాను” అని కంటతడి పెట్టారు.

News February 28, 2026

సిద్ధవటంలో చిరుత సంచారం

image

సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.

News February 28, 2026

కడప: ఇద్దరు MEOలు సస్పెండ్

image

ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్‌లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.