News August 12, 2024
మౌస్ డీర్ సంతతి కేంద్రంగా నెహ్రూ జూపార్క్

నెహ్రూ జూపార్క్ మూషిక జింకల (మౌస్ డీర్) సంతతి వృద్ధి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇండియన్ వైల్డ్ యానిమల్ యాక్ట్ 1972 ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాలోని షెడ్యూల్-1లో మూషిక జింకను చేర్చారు. దేశంలో ఇవి కనుమరుగవుతున్న నేపథ్యంలో 2010 మార్చి 3న, నెహ్రూ జూపార్క్ను ఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ వాటి సంతతి కేంద్రంగా దీన్నిిి గుర్తించింది. ఆ తర్వాత ఇందులో 500 మూషిక జింకలు జన్మించాయి.
Similar News
News January 20, 2026
HYD: కొండపై కొలువైన శ్రీనివాసుడు

బిర్లా మందిర్.. ఎత్తైన కొండపై నగరవాసులకు ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలిగిపోతోంది. హుస్సేన్సాగర్కు దక్షిణాన నౌబత్పహాడ్, కాలాపహాడ్ కొండలపై కొలువై కళకళలాడుతోంది. 1976లో రాజస్థాన్ తెల్ల పాలరాయితో బిర్లా ఫౌండేషన్ నిర్మించింది. ఉత్తర, ఉత్కల్, ద్రవిడ వాస్తు శైలుల సమ్మేళనంగా నిర్మించారు. ఈ గుడిలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి రూపం తిరుమలలోని స్వామిని స్మరింపజేస్తుంది. నగర శోభను మరింత పెంచుతోంది.
News January 20, 2026
బోరాబండలో దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

HYDలో బోరాబండ రాజీవ్గాంధీనగర్కు చెందిన భార్య రొడ్డె సరస్వతి (32)ని భర్త రొడ్డె ఆంజనేయులు రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆంజనేయులు అనుమానిస్తూ తరచూ గొడవ పడేవాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
News January 20, 2026
HYD: రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం!

HYDలో నివాస స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి TGRSCL అవకాశం కల్పించింది. తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లోని 137 బహిరంగ ప్లాట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వేలం తేదీలు: ఫిబ్రవరి 7, 8.
ధర: గజం కనీస ధర రూ. 20,000 నుంచి రూ. 30,00గా నిర్ణయించారు. (మార్కెట్ రేట్లతో పోలిస్తే తక్కువ)
రిజిస్ట్రేషన్: ఆసక్తి గల వారు ఫిబ్రవరి 6 లోపు మీ-సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకోవాలి.


