News August 12, 2024

ప్రజలు దాడి చేస్తారని జగన్‌కు భయం: అనిత

image

AP: వైసీపీ చీఫ్ జగన్ సెక్యూరిటీని తగ్గించలేదని, భద్రత తగ్గించారంటూ ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని హోం మంత్రి అనిత అన్నారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజమండ్రి జైలును పరిశీలించిన ఆమె.. గతంలో చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. బాబు ఉన్న స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లగానే తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.

Similar News

News November 6, 2025

అమన్‌జోత్ మంచి మనసు.. ❤️

image

భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ప్రతికా రావల్ (308 రన్స్)కు విన్నింగ్ మెడల్ దక్కని విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆమెను 15 మెంబర్ స్క్వాడ్ నుంచి తప్పించడంతో ఆమెకు మెడల్ ఇవ్వలేదు. అయితే నిన్న ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ తన మెడలోని విన్నింగ్ మెడల్‌ను రావల్‌కు ఇచ్చారు. కౌర్ మెడల్ లేకుండా ఫొటో దిగారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News November 6, 2025

కుంకుమ పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు

image

ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తీసుకుంటే బిడ్డ తెల్లగా పుడతాడని చాలామంది భావిస్తారు. బిడ్డ చర్మ ఛాయ తల్లిదండ్రుల జీన్స్‌ని బట్టి ఉంటుందంటున్నారు నిపుణులు. కానీ ప్రెగ్నెన్సీలో కుంకుమపువ్వును తీసుకుంటే అజీర్తి, మూడ్‌ స్వింగ్స్‌, యాంగ్జైటీ, ఒత్తిడి, వేవిళ్లు, అధిక రక్తపోటు, ఐరన్ లోపం వంటివి తగ్గుతాయి. రోజుకు 2-3 రేకల్ని గ్లాసుపాలలో వేసుకొని తీసుకుంటే చాలు. దీనికి ముందు డాక్టరు సలహా తీసుకోవడం ముఖ్యం.

News November 6, 2025

మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే?

image

మనం చేసే ఏ పనినైనా కృష్ణార్పణంగానే చేయాలని ఆ భగవంతుడే ఉపదేశించాడు. ఎప్పుడూ భగవంతుని పనులలోనే నిమగ్నమై ఉంటే, ఇతర ఆలోచనలకు తావుండదు. దీన్నే అవ్యభిచారిత భక్తి అంటారు. ఏకాగ్రత, నిశ్చలత కలిగిన ఈ భక్తిని శుద్ధ భక్తి, అనన్య భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి మార్గం గురించి శ్రీమద్భగవద్గీతలో వివరంగా ఉంది. మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించడమే నిజమైన, శుద్ధ భక్తి. వీటన్నింటి సారం తెలియాలంటే భగవద్గీత చదవాలి.