News August 12, 2024
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రోదసిలోనే సునీత?

బోయింగ్ స్టార్లైనర్లో సమస్యలు తలెత్తడంతో మరో వ్యోమగామితో కలిసి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం పట్టొచ్చని నాసా పేర్కొంది. స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ సాయంతో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. 10 రోజుల మిషన్ కోసం ఈ ఏడాది జూన్ 6న సునీత ISSకు వెళ్లారు.
Similar News
News December 26, 2025
రాష్ట్రంలో IASల బదిలీలు, పోస్టింగులు

TG: పలువురు IASలను బదిలీ చేస్తూ, మరికొందరికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా & డెవలప్మెంట్(HMDA పరిధి) ప్రత్యేక సీఎస్గా జయేశ్ రంజన్ను నియమించింది. ఈయన పర్యాటక ప్రత్యేక సీఎస్గా కొనసాగనున్నారు. అలాగే సిరిసిల్ల కలెక్టర్ హరితను TGPSC కార్యదర్శిగా బదిలీ చేసింది. అటు మరికొందరు ఐఏఎస్లను GHMC జోన్లకు కమిషనర్లుగా నియమించింది.
News December 26, 2025
ఆయుష్ సర్జరీలు CM, మంత్రులకూ చేయాలి: పీవీ రమేశ్

AP: PG <<18651050>>ఆయుర్వేద<<>> వైద్యులను సర్జరీలు చేసేందుకు అనుమతించడంపై రిటైర్డ్ IAS PV రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘AP కిరీటంలో ఇదో కలికితురాయి. ఈ ఆయుష్ శస్త్రచికిత్సలను ఉద్యోగులకే కాకుండా CM, Dy CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకూ తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాం’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలతో ఆంధ్రులను ముంచెత్తుతున్నారని వెటకారమాడారు.
News December 26, 2025
డీలిమిటేషన్: GHMCలో కొత్తగా 6 జోన్లు

TG: GHMC డీలిమిటేషన్కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, డివిజన్లను 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్లను కొత్త జోన్లుగా పేర్కొంది.


