News August 12, 2024
పులివెందులలో దొంగల భయం

పులివెందుల పట్టణంలోని పార్నపల్లి బస్టాండ్లో వరుస దొంగతనాలతో ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు 10కి పైగా దొంగతనాలు జరిగాయని సమాచారం. లింగాలకు చెందిన ఓ వ్యక్తి నుంచి వరుసగా 3 సెల్ ఫోన్లు, రూ.లక్ష నగదు వేర్వేరు సమయాల్లో దొంగలు దోచుకెళ్లారు. ఈ విషయమై అర్బన్ సీఐ మోహన్ కుమార్ మాట్లాడుతూ.. పార్నపల్లి బస్టాండ్లో దొంగతనాలు జరగకుండా పోలీసులతో గస్తీ నిర్వహిస్తామని చెప్పారు.
Similar News
News January 22, 2026
కడప: ‘ఇసుక రీచులు, స్టాక్ పాయింట్లపై పర్యవేక్షణ’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని, ఇసుక రీచులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత, నూతన ఇసుక రీచ్ల గుర్తింపు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు.
News January 22, 2026
కడప: ‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి’

కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేయాలని కోరారు.
News January 22, 2026
కడప: ‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి’

కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేయాలని కోరారు.


