News August 12, 2024
ముగిసిన ఒలింపిక్స్.. ఏర్పాట్లపై మళ్లీ విమర్శలు

పారిస్ ఒలింపిక్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే, అథ్లెట్లకు సరైన వసతులు కల్పించలేదని నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈక్రమంలో గోల్డ్ మెడలిస్ట్ పార్క్లో నిద్రపోయిన ఫొటోను షేర్ చేస్తూ అథ్లెట్లు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారని గుర్తుచేస్తున్నారు. భారత అథ్లెట్లూ ఇబ్బంది పడితే కేంద్రం పోర్టబుల్ ఏసీలు పంపింది. వసతులు బాలేకపోవడంతో కొందరు అమెరికన్ అథ్లెట్లు హోటల్స్లో ఉండాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News January 8, 2026
మహబూబ్ నగర్: భార్యాపిల్లల దాడిలో భర్త దారుణ హత్య

మహబూబ్నగర్ జిల్లాలో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పండ్ల వ్యాపారి విస్లావత్ రాములు (56)ను భార్య, పిల్లలే కలిసి కర్రలు, రాడ్లతో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి గొడవ ముదరడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులు కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
News January 8, 2026
ED రైడ్స్.. IPAC ఆఫీసుకు మమత పరుగులు

<<18796717>>ED రైడ్స్<<>>తో WBలో రాజకీయ వేడి రాజుకుంది. తనిఖీలు జరుగుతున్న కోల్కతా సాల్ట్లేక్లోని IPAC ఆఫీసుకు CM మమత చేరుకున్నారు. బిల్డింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు క్లోజ్ చేసి ఉండడంతో బేస్మెంట్లోని లిఫ్ట్లో 11వ ఫ్లోర్లోని IPAC ఆఫీసులోకి వెళ్లారు. ఆమె, పోలీసులు కలిసి ED రైడ్స్ను అడ్డుకున్నారని BJP ఆరోపించింది. దీదీ చర్యలను BJP నాయకులు ఖండిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.
News January 8, 2026
కోళ్ల దాణా నిల్వలో ఈ జాగ్రత్తలు పాటించండి

కోళ్ల దాణా బస్తాలను గోడలకు, నేలకు తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. రెండు వరుసల మధ్య 2 అడుగులు ఖాళీ ఉంచాలి. బాగా ఎండి, పొడిగా ఉన్న ముడి సరుకులనే నిల్వ చేయాలి. చలికాలంలో దాణాలో తేమ 9 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. దాణాను 2-3 వారాలకు మించి నిల్వ చేయకూడదు. వేడిగా ఉన్న దాణా లేదా ముడి సరుకులను చల్లబడిన తర్వాతే గోదాముల్లో నిల్వ చేయాలి. లేకుంటే దాణా ఉంచిన బస్తాలపై తేమ పేరుకొని బూజు పడుతుంది.


