News August 12, 2024
రైల్వే ఉద్యోగికి మూడేళ్ల జైలు

లంచం కేసులో వెస్ట్రన్ రైల్వేస్లో ఓ మాజీ ఉద్యోగికి గుజరాత్లోని గాంధీనగర్ CBI కేసుల ప్రత్యేక జడ్జి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి ఓ కాంట్రాక్టర్ నుంచి 2008లో అప్పటి సీనియర్ అసిస్టెంట్ ఆర్థిక సలహాదారైన విద్యాసాగర్ రూ.20 వేలు లంచం తీసుకోవడంతో సీబీఐ కేసు నమోదైంది. 2009లో చార్జిషీట్ దాఖలు చేయగా తాజాగా కోర్టు శిక్ష, రూ.75 వేల జరిమానా విధించింది.
Similar News
News November 3, 2025
చెత్త పనులు చేయడం వైసీపీకి పరిపాటిగా మారింది: మంత్రి లోకేశ్

AP: డ్రగ్స్ సరఫరా చేస్తున్న YCP స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డిని ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘డ్రగ్స్ వద్దని ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే YCP పాత వాసనలు వదులుకోవట్లేదు. చెత్త పనులు చేయడం, రాష్ట్రంలో ఏదో అయిపోతుందంటూ హడావుడి చేయడం పరిపాటిగా మారింది. YCP ఫేక్ పార్టీ అని అనేది అందుకే. ఆ పార్టీ నడిపేది స్టూడెంట్ వింగ్ కాదు, డ్రగ్స్ వింగ్’ అని ఆరోపించారు.
News November 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 55 సమాధానాలు

1. అయోధ్య నగరాన్ని ‘మను చక్రవర్తి’ నిర్మించారు.
2. విచిత్రవీర్యుని తండ్రి ‘శంతనుడు’.
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ‘ఏడు’ రోజులు ఎత్తి పట్టుకున్నాడు.
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలను ‘చక్రాలు’ అని అంటారు.
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని‘మోక్షం’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 3, 2025
APPLY NOW: CCIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) 14 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, పీజీ(ఎకనామిక్స్), బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు రూ.60వేలు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://cci.gov.in


