News August 13, 2024
మహబూబ్నగర్: బంద్కు హిందూ సంఘాల పిలుపు

బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్కు హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపునిస్తున్నాయి. సోమవారం మక్తల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. నేడు ఉమ్మడి జిల్లాలోని మద్దూర్, కోస్గి, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల, తదితర ప్రాంతాల్లో బంద్ చేపట్టాయి. ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి.
Similar News
News January 1, 2026
పాలమూరు వాసికి విశిష్ట రంగస్థల పురస్కారం

2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు వరించింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన, రంగస్థల కళల్లో పీహెచీ పూర్తి చేశారు. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని ఈనెల 2న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదానం చేయనున్నారు. #CONGRATULATIONS
News January 1, 2026
MBNR: పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించను: ప్రెసిడెంట్

సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మనందరి అదృష్టమని,పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించబోమని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. భూత్పూర్లో నూతన సర్పంచుల సన్మాన ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచులు, ఇతర సభ్యులు,స్వతంత్ర, ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలోకివచ్చే అందరూ సమిష్టిగాఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆయన కోరారు.
News January 1, 2026
MBNR:News Year..స్టాల్స్ ఏర్పాటుకు ఆహ్వానం

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని స్థానిక మయూరి ఎకో పార్క్కు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున పార్క్ లో రుసుముతో కూడిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకున్న వారు స్థానిక పార్క్ లో సంప్రదించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


