News August 13, 2024
అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.
Similar News
News January 19, 2026
21వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోడి: GVMC

పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా జనన రిజిస్టర్లో నమోదు చేసుకోలేదా.. మీకోసమే GVMC మరో అవకాశం కల్పించింది. GVMC పరిధిలో ఉన్నవారు ఈనెల 21వ తేదీలోగా జనన రిజిస్టర్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. అన్ని జోనల్ కార్యాలయాల్లోని జనన రిజిస్టర్ అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 22 నుంచి వీరికి రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు.
News January 19, 2026
విశాఖ జాయింట్ కలెక్టర్గా విద్యాధరి బాధ్యతల స్వీకరణ

విశాఖపట్నం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా గొబ్బిళ్ల విద్యాధరి సోమవారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని ఆమె పరిచయం చేసుకున్నారు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్గా పని చేసిన మయూర్ అశోక్ బదిలీపై గుంటూరు వెళ్లారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.
News January 19, 2026
వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే మెమోలు: కలెక్టర్

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.


