News August 13, 2024
దువ్వాడ శ్రీనివాస్-మాధురి వ్యవహారం: భర్త ఏమన్నారంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723540477848-normal-WIFI.webp)
AP: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల <<13822834>>మాధురి<<>> వ్యవహారంపై అమెరికాలో ఉంటున్న ఆమె భర్త మహేశ్ చంద్రబోస్ స్పందించారు. ‘నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. కానీ మాధురి ఇష్టపడటంతో వైసీపీలోకి వెళ్లేందుకు మద్దతిచ్చాను. నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె రాజకీయంగా ఎదుగుతోందనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మాధురిపై ఎవరెన్ని చెప్పినా నేను నమ్మను’ అని స్పష్టం చేశారు.
Similar News
News February 8, 2025
కార్తీ ఖైదీ-2లో కమల్ హాసన్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738971791584_695-normal-WIFI.webp)
లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తీ హీరోగా ఖైదీ-2 మూవీ త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. లోకేశ్-కమల్ కాంబోలో 2022లో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో భాగంగానే ఖైదీ సీక్వెల్ కూడా ఉండనుంది.
News February 8, 2025
ఢిల్లీ దంగల్లో విజేత ఎవరు? నేడే కౌంటింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738956690217_695-normal-WIFI.webp)
దేశమంతా ఆసక్తి ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఉ.7గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా, ఏ పార్టీది గెలుపనేది మ.12కు క్లారిటీ రానుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద EC పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ప్రతి అప్డేట్ను WAY2NEWS మీకు ఎక్స్క్లూజివ్గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్లో చూడవచ్చు.
News February 8, 2025
ఉదయం లేవగానే రీల్స్ చూస్తున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738910051206_746-normal-WIFI.webp)
ఉదయం లేవగానే మొబైల్ పట్టుకుని రీల్స్ చూస్తే కార్టిసాల్ హార్మోన్ పీక్స్కి వెళ్లిపోయి రోజంతా స్ట్రెస్ ఫీలవుతారని డాక్టర్లు చెబుతున్నారు. దానికి బదులు సూర్యరశ్మి పడే ప్రదేశంలో కాసేపు నిల్చొని డే స్టార్ట్ చేస్తే చికాకు, స్ట్రెస్ దూరమవుతుందని అంటున్నారు. సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి రాగానే టీవీలో గొడవలు పడే న్యూస్ చూసేబదులు పిల్లలు, కుటుంబంతో సరదాగా మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని సూచిస్తున్నారు.