News August 13, 2024

ప్రతి విద్యార్థికి ఐడీ కార్డు ఇవ్వాలి: CBN

image

AP: విద్య ప్రతి ఒక్కరి హక్కు అని బడి ఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదని అధికారులకు CM చంద్రబాబు స్పష్టం చేశారు. 100% విద్యార్థుల ఎన్రోల్మెంట్ జరగాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన APAAR ద్వారా ప్రతి విద్యార్థికి ID కార్డు ఇవ్వాలన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

Similar News

News December 26, 2025

నేటి ముఖ్యాంశాలు

image

✬ AP: వాజ్‌పేయి ఒక యుగ పురుషుడు: చంద్రబాబు
✬ వైద్య రంగంలో PPPతోనే మేలు: నడ్డా లేఖ
✬ తల్లి విజయమ్మతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
✬ ఇద్దరు TG మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్
✬ రేవంత్‌ను చెట్టుకు కట్టేసి కొట్టాలి: హరీశ్ రావు
✬ వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
✬ బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

News December 26, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన ప్రభాకర్‌రావు కస్టడీ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. 14 రోజుల పాటు సిట్ విచారించింది. రేపు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనుండగా, అనంతరం ఇంటికి వెళ్లనున్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఫైనల్ ఛార్జ్‌షీట్‌లో పొందుపరచనున్న సిట్ JAN 16వ తేదీ తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక అందించనుంది. అటు తాను చట్టప్రకారం వ్యవహరించానని, ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్‌రావు చెప్పారు.

News December 26, 2025

రాష్ట్రంలో IASల బదిలీలు, పోస్టింగులు

image

TG: పలువురు IASలను బదిలీ చేస్తూ, మరికొందరికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా & డెవలప్‌మెంట్(HMDA పరిధి) ప్రత్యేక సీఎస్‌గా జయేశ్ రంజన్‌ను నియమించింది. ఈయన పర్యాటక ప్రత్యేక సీఎస్‌గా కొనసాగనున్నారు. అలాగే సిరిసిల్ల కలెక్టర్ హరితను TGPSC కార్యదర్శిగా బదిలీ చేసింది. అటు మరికొందరు ఐఏఎస్‌లను GHMC జోన్లకు కమిషనర్లుగా నియమించింది.