News August 13, 2024
ఎస్పీ నయీమ్ అస్మితో ఎమ్మెల్యే రాధాకృష్ణ భేటీ

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భీమవరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తణుకు నియోజకవర్గంలోని శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని కోరారు.
Similar News
News February 8, 2026
ఉప ఉత్పత్తులపై మిల్లర్లు దృష్టి పెట్టాలి: కలెక్టర్

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పెదఅమిరంలో శనివారం రైస్ మిల్ యజమానులు, పరిశ్రమ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్లింగ్లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా బలపడవచ్చని తెలిపారు. బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మిల్లర్లు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 8, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్ సీహెచ్ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News February 8, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్ సీహెచ్ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


