News August 13, 2024

మంత్రులకు త్వరలోనే ఐప్యాడ్లు.. ఈ-క్యాబినెట్ భేటీలు

image

APలో కాగిత రహిత క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సమావేశాలకు 40 సెట్ల నోట్స్ ముద్రిస్తుండగా, ఇకపై అన్నీ సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులు, అధికారులకు ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం మంత్రులు, అధికారులకు ప్రభుత్వం ఐప్యాడ్లు అందించనుంది. దీని ద్వారా ప్రింటింగ్ ఖర్చులు ఆదా కావడంతో పాటు లీకేజీల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం అంచనా వస్తోంది.

Similar News

News July 4, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,500 జాబ్స్

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 2,500 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. బ్యాంకుల్లో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జులై 24. ప్రారంభ వేతనం నెలకు రూ.48,480. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 4, 2025

రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

image

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.

News July 4, 2025

నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.