News August 13, 2024
నేను సీఎంగా ఉంటే ఆ జిల్లాలను కలిపేవాడిని: కిరణ్ కుమార్ రెడ్డి

AP: రాష్ట్రంలో జిల్లాలు విభజించి చాలా తప్పుచేశారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను సీఎంగా ఉంటే ఆ జిల్లాలను మళ్లీ కలిపేవాడినని చెప్పారు. సమర్థుడైన చంద్రబాబు సీఎంగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే బ్రిజేశ్ కుమార్ను తప్పించాలని లేకపోతే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు తన ముందున్న సవాళ్లను కేంద్రం సాయంతో పరిష్కరించుకోవాలని సూచించారు.
Similar News
News November 7, 2025
ఏటా 5-10% పెరగనున్న ఇళ్ల ధరలు

ప్రస్తుతం దేశంలో ఏటా ఇళ్ల అమ్మకాలు 3-4L యూనిట్లుగా ఉండగా 2047 నాటికి రెట్టింపవుతాయని CII, కొలియర్స్ ఇండియా అంచనా వేశాయి. భారీ డిమాండ్ వల్ల 2 దశాబ్దాలపాటు ఏటా 5-10% మేర గృహాల రేట్లు పెరుగుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $0.3 ట్రిలియన్లుగా ఉండగా 2047కు $5-10 ట్రిలియన్లకు పెరగొచ్చని తెలిపాయి. మౌలిక వసతులు, రవాణా, వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాయి.
News November 7, 2025
NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 7, 2025
వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.


