News August 14, 2024
నెల్లూరు: మూడు రోజుల్లో నిశ్చితార్థం.. యువకుడి స్పాట్ డెడ్

తల్లికి మందులు తీసుకునేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఆత్మకూరులో జరిగింది. మర్రిపాడు మండలం కదిరినేనిపల్లికి చెందిన సాలెహా(28) జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లి వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. మూడు రోజుల్లో నిశ్చితార్థం.. ఇంతలో తన తల్లికి ఆరోగ్యం బాగొలేకపోపవడంతో మందులను తీసుకునేందుకు ఆత్మకూరుకు బైక్పై వెళ్లాడు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News December 25, 2025
తిరుమలలో నెల్లూరు జిల్లా కలెక్టర్… జిల్లా ప్రధాన న్యాయమూర్తి

తిరుమలలో గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం సందర్భంగా అనుకోకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ కలుసుకున్నాను. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేలా స్వామివారి కృప కటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
News December 25, 2025
ఉదయగిరి: హనీఫ్ మాస్టర్ ఇక లేరు..!

ఉదయగిరికి చెందిన ‘ఉర్దూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్’ గ్రహీత షేక్ మహమ్మద్ హనీఫ్ ఖాలిది(77) ఇక లేరు. బుధవారం రాత్రి ఆయన అనారోగ్య సమస్యలతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. ఆయన జీవితాంతం ఉర్దూ భాష అభివృద్ధికి ఎనలేని సేవలందించారు. అనేక మంది పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించారు. ఆయన ఎంతో శ్రమించి రచించిన “ఉదయగిరి మహనీయులు” పుస్తకం విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో మృతి చెందడం బాధాకరం.
News December 25, 2025
కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలి: జేసీ

కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ వినియోగదారుల దినోత్సవానికి “డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం” అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


