News August 14, 2024

కరీంనగర్: పతాకావిష్కరణ చేసేది వీరే

image

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లాలలో పతాకావిష్కరణ చేసే అతిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్, పెద్దపల్లిలో రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ శారద, సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పతాకావిష్కరణ చేయనున్నారు.

Similar News

News February 25, 2026

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో నగరంలోని పలు కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాను పరిశీలించిన ఆయన, ప్రతి కేంద్రం వద్ద స్టాటిక్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 25, 2026

KNR: నూతన రిసెప్షన్ కేంద్రాన్ని ప్రారంభించిన సీపీ

image

ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్‌ను సీపీ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ సమస్యలు, చలాన్లపై ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని, సలహాలు కూడా ఇవ్వవచ్చని తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News February 25, 2026

KNR: లక్ష్యానికి చేరువలో రుణాల పంపిణీ: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.11,358.47 కోట్ల రుణాలు అందించి, 84.55% లక్ష్యాన్ని సాధించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయానికి రూ.4,665 కోట్లు, MSMEలకు రూ.2,329 కోట్లు మంజూరు చేశామన్నారు. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, నిరుపయోగంగా ఉన్న డిపాజిట్లపై ‘ఉద్గమ్’ పోర్టల్ ద్వారా ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.