News August 14, 2024
జనంపై జగన్ కక్ష కట్టాడు: బీటెక్ రవి

కర్నూల్ జిల్లాలో జరిగిన TDP మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యపై పులివెందుల TDP ఇన్ఛార్జ్ బీటెక్ రవి X (ట్విటర్) వేదికగా స్పందించారు. ‘ఐదేళ్ల నరకాసుర పాలనకు చరమగీతం పాడారని జనంపై కక్ష కట్టాడు జగన్. ప్రజా తీర్పును భరించలేక హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులును YCP కిరాయి మూకలు మట్టుపెట్టాయి.’ అని పేర్కొన్నారు. ‘వైకాపోన్మాదం ప్రజాతీర్పును భరించలేకపోతోంది’ అంటూ ఓ పోస్టర్ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Similar News
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 10, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


