News August 14, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహబూబాబాద్ ఎంపీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ బలరాం నాయక్ కాసేపు చర్చించారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Similar News
News January 19, 2026
వరంగల్: మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించాలి: కలెక్టర్

పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ‘పోష్’ యాక్ట్-2013పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి కార్యాలయంలో చట్టాన్ని పక్కాగా అమలు చేసి, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొని మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు.
News January 19, 2026
WGL: సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

వరంగల్ జిల్లాలోని ప్రజావాణి వినతులకు అధికారులు వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో ఆమె బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ రామ్రెడ్డి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
News January 19, 2026
వరంగల్: ఇక పట్టణాల్లో ఇందిరమ్మ చీరలు..!

గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేసింది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణాల్లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది. జిల్లాలో వర్ధన్నపేట, నర్సంపేట మునిసిపాలిటీలు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యేలు చీరలను పంపిణీ చేయడానికి గాను సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ వెలువడక ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని నేతలు భావిస్తున్నారు.


