News August 14, 2024
బీసీసీఐ-బైజూ సెటిల్మెంట్పై సుప్రీం కోర్టు స్టే

బైజూస్కు, బీసీసీఐకి మధ్య రూ.158.9 కోట్లకు సెటిల్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సెటిల్మెంట్ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(NCLAT) ఆమోదించడాన్ని సవాలు చేస్తూ అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం NCLAT నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి నోటీసులిచ్చేవరకూ సెటిల్మెంట్ డబ్బును బ్యాంకు ప్రత్యేక ఖాతాలో ఉంచాలని స్పష్టం చేసింది.
Similar News
News January 26, 2026
కడప: ఇన్స్టాతో పరిచయం.. లాడ్జిలో యువతిపై అత్యాచారం

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. అలిపిరి CI రామ్ కిశోర్ వివరాల మేరకు.. కడప(D) బద్వేల్కు చెందిన యశ్వంత్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్స్టా ద్వారా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆమెను మాయమాటలతో హోమ్స్టేకు పిలిపించిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్కు బ్రాండ్ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


