News August 15, 2024
కొత్తగా 4 వేల రేషన్ షాపులు

AP: ఇంటింటికీ రేషన్ పథకానికి ఉపయోగించిన 9,260 MDU వాహనాలతో ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి బదులుగా చౌకదుకాణాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్తగా 4వేల రేషన్ దుకాణాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,796 షాపులు ఉన్నాయి. వాటిలో ఖాళీగా ఉన్న 6,500 దుకాణాలకు త్వరలోనే కొత్త డీలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Similar News
News January 17, 2026
కరీంనగర్: చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి: కలెక్టర్

స్థానిక బాల సదనంకు చెందిన తొమ్మిది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను హైదరాబాద్కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతానం లేని వారు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News January 17, 2026
ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It
News January 17, 2026
DRDOలో JRF, RA పోస్టులు

<


