News August 15, 2024

పెద్దన్నగా అండగా ఉంటా.. యువతకు సీఎం రేవంత్ భరోసా

image

TG: అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలు అందించామని CM రేవంత్ తెలిపారు. ‘TGPSCని ప్రక్షాళన చేసి గ్రూప్-1 ప్రిలిమినరీ, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి DSC నిర్వహించాం. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మేం పరిష్కరిస్తాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. పెద్దన్నగా మీకు అండగా ఉంటా’ అని యువతకు హామీ ఇచ్చారు.

Similar News

News November 3, 2025

మెగ్నీషియంతో జుట్టుకు మేలు

image

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్‌, చిక్కుళ్లు, అరటి, జామ, కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News November 3, 2025

బస్సు ప్రమాదంపై మోదీ విచారం.. పరిహారం ప్రకటన

image

TG: మీర్జాగూడ <<18184089>>ప్రమాదంపై<<>> ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News November 3, 2025

బస్సు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

image

మీర్జాగూడ <<18183773>>బస్సు<<>> ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.