News August 15, 2024
తుంగభద్ర డ్యాం గేట్ ఏర్పాటు ప్రక్రియ షురూ

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేటు బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడి పర్యవేక్షణలో తాత్కాలిక గేటును అమరుస్తున్నారు. రేపు సాయంత్రంలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10న 19వ క్రస్ట్ గేట్ విరిగి కొట్టుకుపోయింది. కొత్త గేట్ ఏర్పాటు చేసేందుకు నీటిని దిగువకు వదలాల్సి రావడంతో ఆరు రోజుల్లో 45 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
Similar News
News July 8, 2025
వరుసగా మూడు సెంచరీలు చేసిన ముషీర్

టీమ్ ఇండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నారు. లౌబరో UCCEతో జరిగిన మ్యాచులో ముంబై ఎమర్జింగ్ టీమ్ తరఫున ఆడుతున్న ముషీర్ వరుసగా మూడో సెంచరీ చేశారు. 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశారు. అంతకుముందు నాటింగ్హమ్ షైర్తో జరిగిన మ్యాచులో సెంచరీతో పాటు ఆరు వికెట్లు తీయగా, కంబైన్డ్ నేషనల్ కౌంటీస్పైనా సెంచరీ చేశారు.
News July 8, 2025
రెండు రోజులు భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

TG: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, BHPL, మెదక్, కామారెడ్డిలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 40-50km వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
News July 8, 2025
జనగణన.. పౌరులే వివరాలు సమర్పించే అవకాశం

దేశ వ్యాప్తంగా చేపట్టే జన, కులగణనలో పౌరులే నేరుగా తమ వివరాలు సమర్పించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కల్పించనుంది. ఇందుకోసం త్వరలోనే ఓ వెబ్సైటును అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత 2026 ఏప్రిల్ 1న ఇళ్ల వివరాలతో కూడిన జాబితా, ఆ తర్వాత 2027 ఫిబ్రవరి 1 నుంచి జనగణనను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు. ఇదే సమయంలో కులగణననూ చేపడతారు. ఈ రెండు విడతల్లోనూ ప్రజలు తమ వివరాలు పోర్టల్లో నమోదు చేయవచ్చు.