News August 15, 2024
మోదీ జీ.. మెడల్స్ తెచ్చిన పిస్టల్ ఇదే

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒలింపిక్స్లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ క్రమంలో మనూ భాకర్ తనకు పతకాలు తీసుకొచ్చిన పిస్టల్ను ప్రధానికి చూపించారు. పారిస్ వెళ్లిన ప్రతి ప్లేయర్ ఛాంపియన్ అని ప్రధాని మోదీ కొనియాడారు. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడలను ప్రొత్సహిస్తుందని, అత్యున్నతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
NHలపై ప్రమాదాలు.. కాంట్రాక్టర్లకు భారీ ఫైన్లు

నేషనల్ హైవేలపై ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని 500M పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్కు ₹25L, మరుసటి ఏడాదీ యాక్సిడెంట్ జరిగితే ₹50L ఫైన్ విధించనుంది. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్(BOT) విధానంలో నిర్మించే రోడ్లకు దీన్ని వర్తింపజేస్తామని, ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదేనని ఓ అధికారి వెల్లడించారు.
News November 2, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
News November 2, 2025
ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది: మోదీ

అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం <<18179210>>విజయవంతం<<>> కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన అంతరిక్ష రంగం దేశ ప్రజల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని కొనియాడారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘మన సైంటిస్టుల ఘనత వల్ల అంతరిక్ష రంగం నూతన ఆవిష్కరణలకు, ప్రయోగాలకు పర్యాయపదంగా మారింది. వారి విజయాలు దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఎన్నో జీవితాలకు సాధికారత కల్పిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.


