News August 15, 2024

అన్నక్యాంటీన్లు: ఆస్పత్రుల దగ్గర పెడితే..

image

AP: అన్నక్యాంటీన్లలో రూ.15కే కడుపు నింపుకోవచ్చు. తొలి విడతలో ప్రభుత్వం 100 క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేస్తే చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోగిని చూసుకునే అటెండెంట్ బయట హోటల్లో ఒక్కపూట భోజనం చేయాలంటే కనీసం రూ.50 నుంచి రూ.80 ఖర్చవుతోంది. వీటి ఏర్పాటుతో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ రూ.15తో చేయొచ్చు. మీరేమంటారు?

Similar News

News July 5, 2025

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఏపీతో జలవివాదం నేపథ్యంలో జల్‌శక్తి మినిస్టర్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

News July 5, 2025

ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

image

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.

News July 5, 2025

PF అకౌంట్లో వడ్డీ జమ చేసిన EPFO

image

దేశంలోని కోట్లాది మంది PF ఖాతాదారులకు EPFO శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ డబ్బును జమ చేసింది. PF ఖాతాలో ఉన్న ఎంప్లాయి, ఎంప్లాయర్ షేర్ డబ్బుపై <<16496950>>8.25శాతం<<>> వడ్డీకి తగినట్లు ఈ డబ్బును జమ చేసింది. PF ఖాతాదారుల పాస్‌బుక్‌లో 31/03/2025 నాడు ఈ వడ్డీ జమ చేసినట్లు అప్‌డేట్ అయ్యింది. మీ ఖాతాలోనూ PF వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? చెక్ చేసుకోండి.