News August 16, 2024
KNR: ప్రేమ పెళ్లి చేసుకున్న ఆరేళ్లకు ముఖం చాటేసిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరేళ్లకు భర్త ముఖం చాటేశాడు. బాధితురాలి ప్రకారం.. ముల్కనూరుకు చెందిన రంజిత్ రాజమండ్రి(AP)లోని ఓ ఆస్పత్రిలో పని చేస్తూ అక్కడే నర్స్గా పని చేస్తున్న చంద్రకళను 2018లో పెళ్లి చేసుకున్నాడు. జులై9న స్వగ్రామం వచ్చి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులతో కలిసి బాధితురాలు ముల్కనూర్ వచ్చింది. భర్త కుటుంబీకులు కట్నం తేవాలంటున్నారని, వారినుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 11, 2025
హుజూరాబాద్: జ్వరంతో పదోతరగతి విద్యార్థిని మృతి

హుజూరాబాద్ మండలం చెల్పూర్కు చెందిన బండారి రమ్య జ్వరంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. రమ్య గ్రామంలోని పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. అయితే ఆమెకు వారం రోజుల క్రితం జ్వరం రాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో మంగళవారం జ్వరం తీవ్రతరం కావడంతో మృతిచెందిందని తల్లిదండ్రులు తెలిపారు.
News March 11, 2025
గంగారం మృతికి కేంద్రమంత్రి బండి సంజయ్ సంతాపం

రాజన్న సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు అయిన లిఫ్టులో పడి మృతి చెందడం బాధాకరమని అన్నారు. గంగారాం కుటుంబ సభ్యులకు బండి సంజయ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగారాం ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని అన్నారు.
News March 11, 2025
కరీంనగర్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. కరీంనగర్లో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!