News August 16, 2024
‘హరిహరవీరమల్లు’ షూటింగ్ పునః ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723788224604-normal-WIFI.webp)
కొన్ని నెలలుగా ఆగిపోయిన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఈ నెల 14 నుంచి పునః ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. స్టంట్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో 400-500 మంది ఫైటర్స్, జూనియర్ ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొంటారని, ఎప్పుడూ చూడని కొత్త గెటప్లో అలరిస్తారని పేర్కొన్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 9, 2025
రేపటి నుంచి ‘భాగ్యనగర్’ బంద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739073867605_81-normal-WIFI.webp)
TG:ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10 నుంచి 21 వరకు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు తిప్పలు తప్పవు.
News February 9, 2025
బీజేపీ బలోపేతానికి కారణమే మీరు.. కేటీఆర్కు కోమటిరెడ్డి కౌంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739072476025_653-normal-WIFI.webp)
TG: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి <<15396872>>అభినందనలు<<>> తెలిపిన కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం ఆయనదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికి బీఆర్ఎస్సే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు.
News February 9, 2025
16 నుంచి పెద్దగట్టు జాతర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739073041782_81-normal-WIFI.webp)
TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల(మ) దురాజ్పల్లి లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 20 వరకు ఇది జరగనుంది. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి లక్షల మంది వస్తారు. అటు జాతరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.