News August 17, 2024

పార్లమెంట్‌లో PAC ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

image

పార్లమెంట్‌లో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ నియమితులయ్యారు. 15 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఇందులో తెలుగు ఎంపీలు సీఎం రమేశ్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వల్లభనేని బాలశౌరి, కె.లక్ష్మణ్‌కు చోటు దక్కింది. అలాగే గణేష్‌సింగ్ నేతృత్వంలోని ఓబీసీ సంక్షేమ కమిటీలో లక్ష్మీనారాయణ, తనూజారాణి, బీద మస్తాన్‌రావు ఉన్నారు.

Similar News

News October 14, 2025

విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం

image

APలోని విశాఖలో గూగుల్ AI హబ్‌ లాంచ్ అవడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయి. AI, టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తిమంతమైన ఆయుధంగా పనిచేయనుంది. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుంది’ అని ట్వీట్ చేశారు.

News October 14, 2025

అఫ్గాన్‌, పాక్‌ మధ్య మళ్లీ హోరాహోరీ పోరు

image

పాక్, అఫ్గానిస్థాన్‌ మధ్య మళ్లీ హోరాహోరీ ఘర్షణ తలెత్తింది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్‌ తమ పౌరులను టార్గెట్‌ చేసుకొని కాల్పులు జరుపుతోందని అఫ్గాన్‌ ఆరోపించింది. ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారని వివరించింది. తమ సైన్యం కూడా దీటుగా బదులిస్తోందని పేర్కొంది. కాగా ఇటీవల జరిగిన కాల్పుల్లో 58 మంది పాక్‌ సైనికులు మరణించినట్లు అఫ్గాన్‌ ప్రకటించడం తెలిసిందే.

News October 14, 2025

హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

image

రిజర్వ్ బ్యాంక్ రెపో <<17882889>>రేట్‌ను<<>> 5.50శాతంగా కొనసాగించడంతో HDFC, BOB, ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంకు MCLR రేట్లను తగ్గించాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో హోమ్ లోన్లపై EMI తగ్గింది. టెన్యూర్‌ను బట్టి BOBలో కనిష్ఠంగా 7.85శాతం, గరిష్ఠంగా 8.75శాతం, IDBIలో 8-9.70శాతం, ఇండియన్ బ్యాంక్‌లో 7.95-8.85శాతం, HDFCలో 8.4-8.65 శాతం వరకు లోన్లు లభిస్తున్నాయి. తగ్గించిన వడ్డీరేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.