News August 17, 2024

HYD: HYDRA.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది!

image

ప్రభుత్వ భూముల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం అతిపెద్ద సంస్థగా ఏర్పడిన HYDRA అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో HYDRA కమిషనర్ రంగనాథ్ IPS నేతృత్వంలో కొనసాగుతోంది. ఇద్దరు ఎస్పీలు, పలు విభాగాల అధికారులతో కలిపి దాదాపు 3,000 మందితో సంస్థ మరింత బలపడనుంది. ఇప్పటికే HYDలో ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్నారు.

Similar News

News May 8, 2025

ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News May 7, 2025

హయత్‌నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

image

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.