News August 17, 2024
భద్రత లేదంటూ గవర్నర్కు RG కర్ వైద్యుల వేడుకోలు

RG కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దుర్మార్గాలు జరుగుతున్నాయని అక్కడి వైద్యులు బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్కు వివరించారు. తమ భద్రతపై 30-35 మందితో కూడిన బృందం ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. బుధవారం రాత్రి విధ్వంసం జరిగాక తాము సురక్షితంగా లేమన్న భావన కలుగుతోందని ఆవేదన చెందింది. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ వారికి హమీ ఇచ్చారు.
Similar News
News November 12, 2025
RCB ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్!

బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో RCB సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే RCB తమ మ్యాచులను హోమ్ గ్రౌండ్లో ఆడకపోవడం ఇదే తొలిసారి కానుంది. అటు సొంత టీమ్ అభిమానులకు నిరాశే మిగలనుంది.
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<
News November 12, 2025
షాహీన్.. పనులతో పరేషాన్!

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్తో షాహీన్కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.


