News August 17, 2024

వైద్యులు, నర్సుల భద్రతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి దామోదర్

image

ప్రైవేటు ఆసుపత్రుల పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది భద్రతపై శుక్రవారం ఉన్నతాధికారులు, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు.

Similar News

News March 2, 2026

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్‌

image

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు

News March 2, 2026

MDK: ప్రశాంతంగా, కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండగ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటాల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని తెలిపారు.

News March 2, 2026

ఇంటర్మీడియట్ పరీక్షకు 95.55 శాతం హాజరు

image

జిల్లాలో ఐదవ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర బోటనీ I, పొలిటికల్ సైన్స్-1, మ్యాథ్స్ -1A పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. 95.55 శాతంగా జనరల్ విభాగంలో 6706 గాను 6401 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 612 గాను 592 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.