News August 17, 2024

మ‌మ‌తపై నిర్భ‌య త‌ల్లి ఆగ్ర‌హం

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం ఘ‌ట‌న‌లో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగడంపై నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘటన నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. మమతా ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమవుతోందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆశాదేవి కోరారు.

Similar News

News January 27, 2026

లోకేశ్ యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు

image

AP: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27న కుప్పంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేశారు. తన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు.

News January 27, 2026

ప్రారంభమైన అఖిలపక్ష భేటీ

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, కిరణ్ రిజిజు నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి TDP తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు, YCP-మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్, BRS-సురేశ్ రెడ్డి, JSP నుంచి బాలశౌరి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై నేతలకు కేంద్రం ఇందులో సమాచారం ఇవ్వనుంది.

News January 27, 2026

నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన కేంద్ర బృందం

image

TG: సింగరేణి కంపెనీలో CSR నిధులు దుర్వినియోగం అయినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారుల బృందం గుర్తించింది. మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్, రాజీవ్ అభయ హస్తం పథకం సహా కొన్ని ఇతర అంశాలకూ ఈ నిధులు వినియోగించినట్లు కనుగొంది. అలాగే నైనీ బొగ్గు టెండర్ల డాక్యుమెంట్లను లోతుగా విశ్లేషణ చేసింది. వీటిపై తన పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. గత వారం బృందం HYD వచ్చి విచారించడం తెలిసిందే.