News August 18, 2024
TODAY HEADLINES

* PM మోదీతో చంద్రబాబు భేటీ.. అమరావతి, పోలవరంపై చర్చ
* ఉద్యోగుల బదిలీలకు AP ప్రభుత్వం ఆమోదం
* YCPకి ఆళ్ల నాని రాజీనామా
* స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు TG ప్రభుత్వం నిర్ణయం
* సీఎం రేవంత్ BJPలో చేరుతారు: KTR
* రుణమాఫీపై BRS, కాంగ్రెస్ మధ్య సవాళ్లు
* కర్ణాటకలో ముడా స్కామ్: సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశం
* గవర్నర్ నిర్ణయం చట్ట విరుద్ధం: సిద్దరామయ్య
* బంగ్లా అల్లర్లలో 650 మంది మృతి: ఐరాస
Similar News
News March 4, 2026
శాసనమండలిలో గందరగోళం

AP: మండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ గందరగోళానికి దారితీసింది. ఛైర్మన్ ఒకే అంశంపై 2 తీర్మానాలను చర్చకు అనుమతించడం సరికాదని మంత్రి నాదెండ్ల అన్నారు. అలా అనుమతిస్తే ప్రభుత్వ స్టేట్మెంట్ను వినాలన్నారు. అందుకు ఛైర్మన్ మోషేను రాజు అనుమతించకపోవడంతో ఇలాంటి చెడు సంప్రదాయాన్ని కొత్తగా తీసుకురావద్దని నాదెండ్ల వ్యాఖ్యానించారు. దీన్ని ఛైర్మన్ ఖండించగా, ప్రభుత్వం ఆయనను అవమానిస్తోందని YCP ఆందోళనకు దిగింది.
News March 4, 2026
మనుగడ కోసం మొదలై ప్రపంచ గుర్తింపు!

అవసరం కోసం పుట్టిన దావణగెరె బెన్నె దోసె నేడు కర్ణాటక రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. 1928లో చెన్నమ్మ అనే మహిళ తన బిడ్డల ఆకలి తీర్చడం కోసం దోసెలు అమ్మడం ప్రారంభించారు. ఆమె స్వయంగా తీసిన తాజా తెల్లటి వెన్న (బెన్నె) ఈ దోసెలకు మంచి రుచిని ఇచ్చింది. కేవలం మనుగడ కోసం మొదలైన ఓ తల్లి పోరాటం.. నేడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అద్భుతమైన అల్పాహారంగా మారింది. ఇలాంటివి మీ ప్రాంతాల్లోనూ ఉన్నాయా? COMMENT
News March 4, 2026
ప్రభుత్వ పథకాలు.. అప్లికేషన్ స్టేటస్ ఇక ఈజీగా తెలుసుకోవచ్చు!

TG: సంక్షేమ పథకాల అప్లికేషన్ల స్టేటస్ను దరఖాస్తుదారులు ఈజీగా తెలుసుకునేలా ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకొస్తోంది. దీనికోసం ప్రతి విభాగం ఈ-ఆఫీస్ ,డిజిటల్ గవర్నెన్స్ను అమలు చేస్తోంది. సీనియర్ IAS జయేష్ రంజన్ అధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ విధానాన్ని రూపొందిస్తోంది. 3 వారాల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.


