News August 18, 2024
ఇంటర్ సిలబస్ కుదింపు.. బోర్డు పరీక్ష ఎత్తివేత?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723936846337-normal-WIFI.webp)
AP: ఇంటర్ సిలబస్, పరీక్షల విధానంలో మార్పులకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. MPCలో గణితం(2 పేపర్లు), BiPCలో వృక్ష, జంతు శాస్త్రం సిలబస్లను కుదించాలని యోచిస్తోంది. NCERTకి అనుగుణంగా వాటిని ఒక్కో పేపర్గా మార్చాలని భావిస్తోంది. అలాగే CBSEలో 11వ తరగతికి బోర్డు పరీక్ష లేకుండా ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని APలో తీసుకొస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందనే విషయాన్ని పరిశీలిస్తోంది.
Similar News
News February 11, 2025
అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739153337747_782-normal-WIFI.webp)
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పాత చట్టాల దుమ్ము దులిపేస్తున్నారు. US వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ఫెడరల్ చట్టం ‘FCPA’ను నిలిపేశారు. మరిన్ని మినహాయింపులు, ఉపశమనం కల్పించేలా సవరించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండిని ఆదేశించారు. అమెరికన్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ కోసం ఇతర దేశాల అధికారులకు లంచం ఇవ్వడం ఈ చట్ట ప్రకారం నేరం. అదానీపై FCPA ప్రకారమే అభియోగాలు మోపడం గమనార్హం.
News February 11, 2025
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక రన్స్ (భారత ప్లేయర్లు)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739251878304_367-normal-WIFI.webp)
*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)
News February 11, 2025
అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252505868_1199-normal-WIFI.webp)
అదానీ గ్రూప్పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.