News August 18, 2024
ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్: పొన్నం

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రూ.1100 కోట్లతో 25వేల స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రతి ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు శానిటేషన్ సిబ్బంది, స్కావెంజర్ల కోసం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న HYD కార్వాన్లోని కుల్సుంపుర MPP, UPP స్కూళ్లను మంత్రి సందర్శించారు.
Similar News
News January 27, 2026
హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు.. నటిపై క్రిమినల్ కేసులు!

లాస్ఏంజెలిస్(US)లోని హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు వేలాడదీసి నటి సిడ్నీ స్వీనీ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా బోర్డుపైకి ఎక్కి బ్రాలను దండగా కట్టి వేలాడదీశారు. ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రచారం కోసం చేసిన స్టంట్ స్వీనీకి సమస్యలు తెచ్చిపెట్టింది.
News January 27, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News January 27, 2026
మోహన్ బాబుకు బెంగాల్ ఎక్సలెన్స్ అవార్డు

డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ చేతుల మీదుగా అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆయనే. 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు అందజేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అమితాబ్-దీపిక నటించిన ‘పీకు(piku)’ డైరెక్టర్ షూజిత్ సిర్కార్ సైతం ఈ పురస్కారం అందుకున్నారు.


