News August 18, 2024

ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్: పొన్నం

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రూ.1100 కోట్లతో 25వేల స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రతి ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు శానిటేషన్ సిబ్బంది, స్కావెంజర్ల కోసం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న HYD కార్వాన్‌లోని కుల్సుంపుర MPP, UPP స్కూళ్లను మంత్రి సందర్శించారు.

Similar News

News July 7, 2025

మస్క్ కొత్త పార్టీ.. పడిపోయిన టెస్లా షేర్లు

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ USలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రీమార్కెట్లో టెస్లా షేర్లు 7% పడిపోయాయి. మస్క్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారాంతంలో $315.35 వద్ద ముగిసిన షేరు ధర తాజాగా $291.96కు పడిపోయింది. ఈ ట్రెండ్ కొనసాగితే సంస్థకు భారీ నష్టాలు తప్పవు. టెస్లా షేర్లు గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు 206%కు పైగా లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం.

News July 7, 2025

రాష్ట్రంలో ఘోరం.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రేమోన్మాది

image

TG: సంగారెడ్డి బండ్లగూడలో ప్రేమోన్మాది ప్రవీణ్ రెచ్చిపోయాడు. ప్రియురాలు రమ్యపై కత్తితో దాడి చేసి హత్యచేశాడు. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతోందని రగిలిపోయిన ప్రవీణ్ ఆమెతో మాట్లాడేందుకు ఇవాళ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించింది. అనంతరం తానూ అదే కత్తితో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

News July 7, 2025

దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలు నిలిపివేత

image

AP: ఈనెల 8-10 వరకు విజయవాడ దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తూ.గో, ప.గో, కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు, వ్యాపారులు అమ్మవారి అలంకరణకు 150టన్నుల కూరగాయలు, 50టన్నుల పండ్లు స్వచ్ఛందంగా అందజేశారు.