News August 19, 2024

ఇదొక అదృష్టంగా భావిస్తున్నా: నిత్యామేనన్

image

జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని హీరోయిన్ నిత్యామేనన్ అన్నారు. ఇదొక అదృష్టంగా భావిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అవార్డును ప్రకటించిన తర్వాత నుంచి అభినందనలు తెలిపేందుకు కాల్స్ వస్తూనే ఉన్నాయని తెలిపారు. అవార్డు వచ్చాక తాను ఎంపిక చేసుకునే చిత్రాలు, టీమ్ మారవని స్పష్టతనిచ్చారు. ‘తిరుచిత్రంబలం’ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం వరించింది.

Similar News

News July 8, 2025

‘డిగ్రీ’ వద్దంటా..!

image

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

News July 8, 2025

తమిళ రీమేక్ చేయనున్న నాగార్జున?

image

నాగార్జున ఓ రీమేక్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శశికుమార్ నటించిన ‘అయోతి’ అనే తమిళ మూవీని నాగ్ రీమేక్ చేయనున్నట్లు టీటౌన్‌లో చర్చ జరుగుతోంది. ఈ మూవీ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి R.మంతిర మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో ఎమోషన్స్, కథ, కథనం గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్‌గానూ వర్కౌట్ అవుతుందని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News July 8, 2025

UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

image

UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.