News August 19, 2024
తీవ్ర విషాదం.. రాఖీ కట్టి చనిపోయింది

TG: సోదరులకు రాఖీ కట్టి ఓ సోదరి తుదిశ్వాస విడిచిన విషాద ఘటన మహబూబాబాద్(D) నర్సింహులపేట(మ)లో జరిగింది. కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమె(17)ను ప్రేమ పేరుతో ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో MHBDలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.
Similar News
News January 6, 2026
SC, STలకు ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: గొట్టిపాటి

AP: సోలార్ రూఫ్ టాప్ పథకానికి టెండర్లు పూర్తి చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ‘సోలార్ రూఫ్ టాప్కి రూ.78వేల వరకు రాయితీ ఉంటుంది. BCలకు అదనంగా మరో రూ.20వేలు, SC, STలకు ఫ్రీగా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం కొన్ని రాష్ట్రాల ఇంధనశాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి విద్యుత్ రంగ ప్రైవేటీకరణ అంశంపై చర్చ నిర్వహించింది. దీనికి కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం’ అని తెలిపారు.
News January 6, 2026
తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్.. ఈ ఫీచర్తో పని ఈజీ!

IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. ‘My Profile’లో ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ వివరాలను ముందే సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బుకింగ్ టైమ్లో మళ్లీ టైప్ చేసే పని ఉండదు. కేవలం ఒక్క క్లిక్తో ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది. గరిష్ఠంగా 12 మంది వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
News January 6, 2026
బంగారు పేపర్లతో భగవద్గీత

కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అపురూపమైన కానుక అందింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో రూపొందించిన స్వర్ణ భగవద్గీతను సమర్పించారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో రూపొందిన ఈ గ్రంథాన్ని విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరించనున్నారు.


